V6 News

సెంచరీ బాదిన కరుణరత్నే..కివీస్ పై లంక విన్

సెంచరీ బాదిన కరుణరత్నే..కివీస్ పై లంక విన్

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 268 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక మొదట్లో తడబడ్డ కరుణరత్నే 122 రన్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్  తొలి ఇన్నింగ్స్ లో 249, శ్రీలంక 267 పరుగులు చేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సెంచరీ చేసిన కరుణ రత్నేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నెల 22 నుంచి రెండో టెస్టు జరగనుంది.