ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు 12 సీట్లు కేటాయిస్తాం: కాసాని జ్ఞానేశ్వర్

ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు 12 సీట్లు కేటాయిస్తాం: కాసాని జ్ఞానేశ్వర్

పరిగి, వెలుగు: బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆదివారం పరిగి మున్సిపల్ కేంద్రంలో పండగల సాయన్న, హైదరాబాద్ తొలి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాలను కాసాని జ్ఞానేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించి, మాట్లాడారు. టీడీపీలో పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

పార్టీ తరఫున రాష్ట్రంలోని ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు 12 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లు రాజకీయంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజలకు సేవలందించే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, మరికొన్ని రోజుల్లో అవినీతి మచ్చ లేకుండా ఆయన బయటకు వస్తారని కాసాని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలు చేస్తే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాజకీయంగా నచ్చడం లేదని, అలాంటప్పుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్క రాష్ట్రాల్లో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు.