నిజామాబాద్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో స్టేట్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి బర్త్డే జరుపుకోవడం వివాదం రేపింది. బుధవారం ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆఫీస్లో యూత్ కాంగ్రెస్ నేతలు రైతులకు మద్దతుగా కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్షలు చేశారు. ఈ శిబిరంలో మానాల మోహన్రెడ్డి బర్త్డే నిర్వహించడానికి ఎన్ఎస్యూఐ మాజీ స్టేట్ జనరల్ సెక్రటరీ వరదబట్టు వేణురాజ్, పుండ్రసాయికుమార్, నరేన్ దీప్ ఏర్పాట్లు చేయగా డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి అభ్యంతరం తెలిపారు.
ఎన్ఎస్యూఐ నేతలు వాదనకు దిగారు. అనంతరం డీసీసీ ఆఫీస్ ప్రాంగణంలో మానాల మోహన్రెడ్డి కేక్ కోశారు. దీనిని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తూ వేణురాజ్, పుండ్రసాయికుమార్, నరేన్దీప్ను పార్టీ నుంచి నగర ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణ సస్పెండ్ చేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశామని, తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
