నిజామాబాద్: యూకేకు ఇందూర్ రైస్...జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్: యూకేకు ఇందూర్ రైస్...జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: యునైటెడ్​ కింగ్​డమ్(యూకే)కు నిజామాబాద్​ బియ్యం ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 24.1 మెట్రిక్ ​టన్నుల బియ్యం లోడ్​వ్యాన్​ను జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి  బుధవారం జెండా ఊపి పంపించారు. 

భారత్, యూకే మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎగుమతులకు అవకాశం లభించిందని, సోనామసూరి రైస్​ను గజానన్ రైస్​మిల్లు నుంచి విశాఖ పోర్టుకు పంపించినట్లు కలెక్టర్​ తెలిపారు. సముద్ర మార్గం గుండా బియ్యం యూకేకు చేరనున్నట్లు చెప్పారు. జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్ ​వీరాస్వామి, హార్టికల్చర్​ అధికారి శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు.