నిజామాబాద్: దళితుల సోషల్ బాయ్కాట్పై విచారణ..వీడీసీ సభ్యులను అరెస్ట్ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్ ఆదేశం

నిజామాబాద్: దళితుల సోషల్ బాయ్కాట్పై విచారణ..వీడీసీ సభ్యులను అరెస్ట్ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్ ఆదేశం

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో దళిత సామాజికవర్గానికి ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటిక భూమి విషయంలో అభ్యంతరం తెలుపుతున్న వీడీసీ తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్ బక్కి వెంకటయ్య సీరియస్ అయ్యారు. దళితవర్గాలపై విధించిన బహిష్కరణపై బుధవారం ఆయన గ్రామానికి చేరుకొని విచారించారు. శ్మశాన వాటిక భూమిని ఉపయోగించకుండా అడ్డుపడుతున్న వీడీసీ తీరును ప్రశ్నించిన ఎస్సీలపై బహిష్కరణ విధించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

తమను ఎవరూ కూలీ పనులకు పిలువొద్దని హుకుం జారీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నమన్నారు. వీడీసీ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగడంలేదని వాపోయారు. స్పందించిన వెంకటయ్య మాట్లాడుతూ.. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. బాధితుల కంప్లయింట్​మేరకు కేసులు నమోదు చేసిన మొత్తం 48 మందిని అరెస్ట్​ చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరున సీఎం రేవంత్​రెడ్డితో జరిగే హైపవర్ మీటింగ్​లో వీడీసీల ఆగడాలను ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు. కమిషన్​సభ్యుడు రాంబాబు నాయక్, డీఆర్వో గీత, ఏసీపీ ప్రకాశ్​యాదవ్​తదితరులు ఉన్నారు.