తాగునీరు వృథా చేస్తే జరిమానాలు : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

తాగునీరు వృథా చేస్తే జరిమానాలు : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: ఎల్​నినో ఎఫెక్ట్​తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని నిజామాబాద్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల ఆఫీసర్లతో ఆమె రివ్యూ నిర్వహించారు. రక్షిత మంచినీటిని భవన నిర్మాణ పనులకు వాడొద్దని ఆదేశించారు. తాగునీటిని వృథా చేసేవారి నుంచి జరిమానాలు వసూలు చేయాలన్నారు. టౌన్​ఏరియాల్లో రూ.10 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.5 వేల పెనాల్టీ వేయాలని ఆదేశించారు. 

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఫాంఫండ్, వాటర్ షెడ్​ నిర్మాణాలు చేపట్టాలని, గ్రౌండ్ వాటర్​ లెవల్​ తగ్గిన ఏరియాలపై ఫోకస్​పెట్టాలన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలను కలెక్టర్ సమీక్షించారు. వచ్చేఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పుష్కరఘాట్లు ఇతర పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఫండ్స్​తో నిర్మాణాలు షురూ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్​డీవో సాయన్న, ఇరిగేషన్​ ఇంజినీర్​ ప్రకాశ్, ఆర్ డబ్ల్యూఎస్​ఆఫీసర్లు ఉన్నారు.