నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఇంటర్ సర్టిఫికెట్స్ ఇవ్వని కాలేజీల గుర్తింపు రద్దు

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఇంటర్ సర్టిఫికెట్స్ ఇవ్వని కాలేజీల గుర్తింపు రద్దు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఇంటర్‌‌‌‌‌‌‌‌ పాసైన స్టూడెంట్స్‌‌‌‌కు ఫీజులు కట్టకపోవడంతో సర్టిఫికెట్స్​ఇవ్వని ప్రైవేట్​ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని డీఐఈవో రవికుమార్​ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాకు ఓ ప్రకటన రిలీజ్​ చేశారు. 

ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు పై చదువుల్లో చేరడానికి టీసీ, బోనోఫైడ్,​ ఇతర సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలన్నారు. ఇబ్బందిపెట్టే మేనేజ్​మెంట్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.