కేసుల నమోదు, నేరాల నియంత్రణలో రాజీ పడొద్దు.. సైబర్ నేరాల నియంత్రణపై యాదాద్రి ఎస్పీ ఆక్షాంక్ష్యాదవ్రివ్యూ

కేసుల నమోదు, నేరాల నియంత్రణలో రాజీ పడొద్దు.. సైబర్ నేరాల నియంత్రణపై యాదాద్రి ఎస్పీ ఆక్షాంక్ష్యాదవ్రివ్యూ

యాదాద్రి, వెలుగు :  నేరాల నియంత్రణలో రాజీ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఎస్పీ ఆక్షాంక్ష్​ యాదవ్​ హెచ్చరించారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన క్రైమ్​ మీటింగ్​లో కేసుల నమోదు, దర్యాప్తు, లా అండ్​ ఆర్డర్, సైబర్​ నేరాల నియంత్రణపై ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటలిజెన్స్​ వ్యవస్థ పనితీరుపై ఆయన మాట్లాడారు. 

ఇంటలిజెన్స్​ వ్యవస్థ వైఫల్యం కారణంగా నేరాలు జరగకుండా చూడడంలో విఫలమవుతున్నట్టుగా కన్పిస్తోందన్నారు.  గ్రామాల్లో ఇంటలిజెన్స్​ వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో సీసీ టీవీ నెట్​ వర్క్​ విస్తరించాలని సూచించారు. పెండింగ్​లో ఉన్న కేసుల విచారణ వేగంగా పూర్తి చేసి క్లోజ్​ చేయాలని ఆదేశించారు. 

సైబర్​సెల్, ఐటీ సెల్​ సమన్వయంగా పని చేసి కేసులను త్వరగా ఛేదించాలని సూచించారు.  అంతకుముందు జరిగిన మీటింగ్​లో అడ్డగూడూరు పీఎస్​లో పోక్సో కేసు ఎఫ్​ఐఆర్​ నమోదుకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై సంబంధిత ఆఫీసర్లను ఆయన ప్రశ్నించగా, ఆఫీసర్లు వివరణ ఇచ్చికున్నట్లు తెలిసింది.