యాదాద్రి, వెలుగు : గర్భిణులు సేప్టీ నార్మల్ డెలివరీ కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు ఆదేశించారు. హెల్త్ వీక్ లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డెలివరీ సమయం దగ్గరపడిన గర్భిణీని సమీపంలోని హాస్పిటల్కు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ మనోహర్, డాక్టర్లు ఉన్నారు.
