- 10న సికింద్రాబాద్లో ప్రధాని మోదీ సభ
- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బీజేపీ నాయకులతో పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ సభపై చర్చించారు. అర్వింద్ మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికలు జరిగిన 5 స్టేట్స్లో బీజేపీ గెలువనుందని ధీమా వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగే సభ తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నాంది కాబోతోందన్నారు.
ప్రధాని మోదీ రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన పార్టీతో బీజేపీకి ఎలాంటి నష్టం లేదని, కేసీఆర్కు మాత్రమే నష్టం జరుగుతుందన్నారు.
కేసీఆర్, కేటీఆర్అవినీతిని కవిత బయటపెడుతున్నారని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, జిల్లా జనరల్ సెక్రటరీలు రవీందర్రావు, నరేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
