టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్
  • టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో లంచ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ లోపలా, బయటా వడ్ల కొనుగోళ్లపై పోరాటం, ఆందోళనలపై చర్చించినట్లు సమాచారం. నిన్న రాజ్యసభలో ఆహారం ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.