టార్గెట్ హుజురాబాద్: ఎంపీటీసీ భర్తతో కేసీఆర్ ఆడియో వైరల్

టార్గెట్ హుజురాబాద్: ఎంపీటీసీ భర్తతో కేసీఆర్ ఆడియో వైరల్

ఈటల రాజేందర్ చాలా చిన్నోడన్నారు సీఎం కేసీఆర్. ఈటలతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఈటల అంశాన్ని పక్కనపెట్టి..  దళిత ప్రతినిధులు ప్రగతి భవన్ కు రావాలన్నారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఈ కామెంట్స్ చేశారు. ఎల్లుండి దళితబంధు పథకంపై ప్రగతి భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశానికి రావాలని ఆహ్వానించారు.  తనుగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామితో మాట్లాడిన సీఎం... ఎల్లుండి హుజురాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ బయల్దేరాలన్నారు. రెండేళ్లలో దళితబంధును ప్రపంచవ్యాప్తం చేద్దామని .. దీని ప్రచారం కోసమే గ్రామానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేసి పిలుస్తున్నామని చెప్పారు కేసీఆర్.