రాష్ట్రంలో మే 7 వరకు ఎలాంటి సడలింపుల్లేవ్

రాష్ట్రంలో మే 7 వరకు ఎలాంటి సడలింపుల్లేవ్

హైదరాబాద్, వెలుగుముందే నిర్ణయించిన ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7 వరకు లాక్ డౌన్​ను ఎప్పటిలాగే  కొనసాగించాలని, అప్పటివరకు ఎక్కడా సడలింపులు ఇవ్వొద్దని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించినట్లు తెలిసింది. కేంద్రం విడుదల చేసిన లాక్​డౌన్​ గైడ్ లైన్స్, సడలింపులపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేయాలని వారికి సూచించారు. ఈ నెల 7 తర్వాత ఏం చేయాలన్న దానిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్​ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. కేంద్రం జారీ చేసిన రూల్స్​ ప్రకారం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో లాక్ డౌన్  సడలింపులను ఈ నెల 7 తర్వాత అమలు చేసే చాన్స్​ ఉందని ఉన్నతాధికారులు అన్నారు.

గైడ్​లైన్స్​ స్టడీ చేస్తున్నం: సీఎస్

లాక్ డౌన్ పై కేంద్రం విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ ను స్టడీ చేస్తున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ చెప్పారు. వీటిపై ఈ  నెల 5న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకుంటారని, అప్పటి వరకు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.