
సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్()Keerti Suresh గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత వచ్చిన మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా తెలుగు, తమిళ్ లో వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి మాత్రం విజయాలు దక్కలేదు. మహానటి సినిమా తరువాత కీర్తి నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. మధ్యలో మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఓ మోస్తరుగా ఆడింది.
అయినప్పటికి.. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చారు కీర్తి. ఇప్పటివరకు ఆమె ఒక్క సినిమాలో కూడా గ్లామర్ రోల్స్ చేసింది లేదు. సర్కారు వారి పాట సినిమాలో ఆ గీతని చెరిపేసింది అనిపిస్తుంది. అది కూడా కేవలం ఒక్క పాటలో. ఆ సినిమా మినహాయిస్తే.. ప్రతీ సినిమాలో పద్దతిగానే కనిపించారు కీర్తి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు పద్ధతి అనే మాటని పక్కన పెట్టేస్తుందట కీర్తి.
ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమా చేస్తోంది. తమిళ తేరీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాను ఒకే చేసే ముందే లిప్ లాక్స్ కంపల్సరీ అని కండిషన్స్ పెట్టారట మేకర్స్. ఇక కీర్తి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఇలాంటి సినిమాలు మాత్రమే చేస్తాను అని అనుకుంటే కుదరదు కదా అని ఒప్పేసుకుందట. అలా కీర్తి తన కెరీర్ లో ఫస్ట్ టైం లిప్ లాక్ సీన్ చేయబోతుందట. అది కూడా వరుణ్ ధావన్ తో. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా తరువాత కీర్తికి వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.