మోదీ, రాహుల్ గాంధీ..చెప్పేవన్నీ అబద్ధాలే : సీఎం విజయన్  

మోదీ, రాహుల్ గాంధీ..చెప్పేవన్నీ అబద్ధాలే : సీఎం విజయన్  

కాసర్​గోడ్ :  కేరళ అభివృద్ధిపై నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిసి బీజేపీ, కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆదివారం కాసర్ గోడ్ లో మీడియాతో విజయన్ మాట్లాడారు. ‘‘బిహార్ లెక్క కేరళలోనూ అవినీతి పెరిగిపోయిందని ప్రధాని మోదీ కామెంట్ చేశారు.

 ఈ వ్యాఖ్యలతో ఆయన రెండు రాష్ట్రాలనూ అవమానించారు. దేశవ్యాప్తంగా చూస్తే కేరళలోనే అవినీతి తక్కువ. మరోవైపు కేరళపై కేంద్రం వివక్ష చూపుతోంది” అని మండిపడ్డారు.దేశాన్ని నడిపించగలననే నమ్మకాన్ని ప్రజల్లో రాహుల్ గాంధీ ఇప్పటికీ కల్పించలేకపోయారని అన్నారు. ‘‘తన ప్రత్యర్థి మోదీ అని చెబుతున్న రాహుల్.. ఆయనపై పోరాడే ప్రయత్నం మాత్రం చేయడంలేదు. ఉత్తరాది నుంచి పారిపోయి వచ్చి రాహుల్​ రెండోసారి వయనాడ్​లో పోటీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి దేశం ఏం ఆశిస్తుంది” అని విమర్శించారు.