కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ ఫొటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాస్పద అంశంపై పిటిషన్ ను స్వీకరించేందుకు కేరళ హైకోర్టు అడివిజన్ బెంచ్ అప్పీల్ను తిరస్కరించింది. అంతకుముందు సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది. అప్పీలుదారుని తప్పుపట్టింది కోర్టు. అంతేకాదు ..అతనిపై భారీ జరిమానా విధించేంత వరకు వెళ్లింది.
ఈ పిటిషన్ను తిరస్కరించిన కేరళ హైకోర్టు ప్రధాని ఫొటోల వినియోగాన్ని ప్రకటనగా పరిగణించలేమని తెలిపింది. టీకాలకు సంబంధించి సందేశం ఇచ్చే హక్కు దేశ ప్రధానికి ఉందని కోర్టు చెప్పింది. సింగిల్ బెంచ్ కూడా ఇంతకుముందు ఈ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇది పనికిమాలిన చర్యగా పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం...