తాగిన మత్తులో 55 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితుడు, పోలీసు అధికారి కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 23న రాత్రి కేరళలోని మైయిల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మైయిల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దినేశన్ (54) తన స్నేహితుడు సజీవన్ను కొట్టి చంపాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి ఇద్దరూ గొడవ పడ్డారని, అనంతరం ఈ ఘటన గురించి స్థానికులు తమకు సమాచారం అందించారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
సెలవుపై వచ్చిన దినేశన్ ఇంట్లో వారిద్దరూ మద్యం తాగినట్లు పోలీసులు చెప్పారు. ఘర్షణ సమయంలో, దినేశన్ ఓ కట్టెతో సజీవన్ తలపై కొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానికులు సజీవన్ను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అతన్ని రక్షించలేకపోయారని పోలీసులు వివరించారు.