- మందుల కోసం వచ్చిన ఫ్యామిలీపై దాడికి యత్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఖైరతాబాద్ వెల్నెస్సెంటర్లో మందుల కోసం వచ్చిన ఓ కుటుంబంపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. స్టాఫ్ అంతా ఆ కుటుంబంపై పడడంతో లిఫ్ట్లో వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అందులోకీ వెళ్లి వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే..మంగళవారం ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డ్ఎంప్లాయీస్కోసం ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ వెల్నెస్సెంటర్కు ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ కొడుకు మందుల కోసం ఫోన్చేశాడు. ఎన్నిసార్లు కాల్చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో తన భార్య, తల్లితో కలిసి సెంటర్కు వచ్చాడు.
రిసిప్షన్ దగ్గరకు వెళ్లి తాను తన తల్లి కోసం ప్రతినెలా తీసుకునే మందుల కోసం ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్చేయలేదని అడిగాడు. అక్కడున్న సిబ్బంది ‘ఫోన్ పని చేయదు. ఏం చేస్కుంటారో చేస్కోండి..ఎక్కడైనా కంప్లయింట్చేస్కోండి’ అని బదులివ్వడంతో ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఫోన్ చాలా రోజులుగా పని చేయడం లేదని తెలుసుకుని, బాధ్యత లేకుండా పని చేస్తున్నారని అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీన్ని చూసిన మిగతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సదరు కుటుంబంతో గొడవపడ్డారు.
చివరకు అందరూ కలిసి ఆ ఫ్యామిలీపై దాడికి యత్నించారు. భయపడి వారు లిఫ్ట్లో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయినా, ఇద్దరు మేల్ స్టాఫ్ లిఫ్ట్లోకి దూసుకువెళ్లి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వాళ్లు ఆ సిబ్బందిని లిఫ్ట్నుంచి బయటకు లాగి ఆ కుటుంబాన్ని పంపించివేశారు. బాధితులు మాట్లాడుతూ ‘ప్రతి నెలా మేం మందుల కోసం వస్తుంటాం. ఉన్నాయో లేవో కనుక్కోవడానికి కాల్చేస్తే లిఫ్ట్ చేయలేదు.. అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడమే కాకుండా దాడికి ప్రయత్నించారు.. ఇద్దరం మహిళలం ఉన్నా కొట్టడానికి మీద మీదకు వచ్చారు’ అని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ గొడవతో అక్కడకు వచ్చిన ఇతర పేషంట్లు భయభ్రాంతులకు గురయ్యారు.
