ఏసీబీ వలలో వాటర్​ వర్క్స్​ అసిస్టెంట్ రాకేశ్

ఏసీబీ వలలో వాటర్​ వర్క్స్​ అసిస్టెంట్ రాకేశ్

హైదరాబాద్, వెలుగు :  ఖైరతాబాద్ వాటర్ వర్క్స్ లో  సీనియర్​అసిస్టెంట్​గా పనిచేస్తున్న రాకేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అక్బర్​ హుస్సేన్​ అనే వ్యక్తి పెండింగ్ బిల్లుల మంజూరు, లీజ్​ లైసెన్స్​ రెన్యూవల్​కోసం రాకేశ్ వద్దకు వెళ్లారు. పని పూర్తి చేసేందుకు రాకేశ్ లక్ష రూపాయలు డిమాండ్​ చేశారు. దాంతో అక్బర్​ హుస్సేన్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. శుక్రవారం రాకేశ్ అనుచరుడైన ఔట్​ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ కు అక్బర్​ హుస్సేన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు వారిని రిమాండ్ కు తరలించారు.