మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కిరణ్

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కిరణ్

మక్తల్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్  కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం ఎమ్మార్సీ ఆఫీస్​ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్  మాట్లాడుతూ జిల్లాలో 512 వంట ఏజెన్సీల్లో 1,527 మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. 

బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పులు చేసి భోజనం పెట్టాల్సి వస్తోందన్నారు. పది నెలలుగా పెండింగ్​లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరారు. మధ్యాహ్న భోజన వర్కర్స్  యూనియన్  మండల అధ్యక్షురాలు లక్షి, వెంకటమ్మ, జ్యోతి, రాజమ్మ, జయమ్మ, పర్విన్​బేగం, రాజమ్మ పాల్గొన్నారు.