ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఎంఐఎం అడ్డంకి అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే కారణమన్నారు. ఈ రెండు పార్టీల గురించి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. MMTS నిర్మాణ పనులను త్వరగా చేపట్టకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఫలక్ నామా వరకు మెట్రో నిర్మాణంను ఎందుకు చేపట్టలేదన్నారు. మెట్రో చార్జీలు కూడా ఎక్కువగా ఉన్నాయని..ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కంటే ఎక్కువ నిధులు కేటాయింయించిందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వాటాను ఇవ్వలేదన్నారు.
see more news