కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షల ఫలితాలను ఇవాళ ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం (పార్ట్–2) పరీక్షల్లో మొత్తం 92.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 34 మంది డిస్టింక్షన్లో ఉత్తీర్ణులు కాగా 1034 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు.
ఈ ఫలితాల్లో మొత్తం 2807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై.మల్లేశ్వర్ తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్ www. knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపారు.