రైతులకు బేడీలు వేయడం బాధాకరం

రైతులకు బేడీలు వేయడం బాధాకరం

హైదరాబాద్, వెలుగు: భువనగిరిలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం బాధాకరమని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తున్నామని మంగళవారం రిలీజ్ చేసిన ప్రెస్​నోట్​లో పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం.. తీవ్రమైన నేరాలు చేసినోళ్లకే బేడీలు వేస్తారని గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్​ అలైన్​మెంట్ మార్చాలని నిరసన తెలిపితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. 

బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధనవంతులకు ఉన్న వందల ఎకరాల పక్క నుంచి, చిన్న రైతుల భూములపై నుంచి ఆర్ఆర్ఆర్ వెళ్తున్నదని విమర్శించారు. ఇప్పటికే గజ్వేల్ నుంచి భువనగిరికి రోడ్ ఉందని గుర్తు చేశారు.