విశ్వేశ్వర్​రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది : కొండా సంగీతారెడ్డి

విశ్వేశ్వర్​రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది : కొండా సంగీతారెడ్డి
  • చిలుకూరులో కొండా సంగీతారెడ్డి ప్రచారం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్​రెడ్డి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఆమె మొయినాబాద్​మండలం చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో డోర్​టు డోర్​క్యాంపెన్​నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 ఈ సందర్భంగా సంగీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కొండా విశ్వేశ్వర్​రెడ్డి ప్రజానాయకులని, అవినీతి రహిత పాలన అందిస్తారని చెప్పారు. చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి విశ్వేశ్వర్​రెడ్డిని తప్పక గెలిపించాలని కోరారు. ఆమె వెంట చేవెళ్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.