కూల్ వాలెట్ యాప్ భారీ మోసం..రోడ్కెక్కిన బాధితులు

కూల్ వాలెట్ యాప్ భారీ మోసం..రోడ్కెక్కిన బాధితులు

దోచుకోవడంలో సైబర్ కేటుగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. అమాయకులను ఆసరగా చేసుకుని దోచుకుంటున్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్నది పోగొట్టుకుంటున్నారు. తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

కరీంనగర్ జిల్లాలో భారీ ఆన్ లైన్ మోసం బయటపడింది. కూల్ వాలెట్ యాప్ పేరుతో నయాదందాకు తెరలేపిన కేటుగాళ్లు.. ఒక్కొక్కరి నుంచి మూడు వేల వరకు వసూలు చేశారు.  జిల్లా వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బాధితులు ఉన్నారు. యాప్ పనిచేయకపోవడంతో కరీంనగర్ వావిలాలపల్లిలో నిర్వాహకుడు విజయరామరాజు ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకుడు విజయరామరాజుతో మరొకరిన  త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.