పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో రంగమార్తాండ

పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో రంగమార్తాండ

ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఇప్పటికే  షూటింగ్  పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ  సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటుంది. మాస్ట్రో ఇళయరాజాతో కలిసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటున్నారు కృష్ణవంశీ. ఈ మేరకు ట్వీట్టర్ ద్వారా ఓ వీడియోని షేర్ చేస్తూ   ఇళయరాజాతో వర్క్ ఎక్స్ప్రీరియన్స్ ను షేర్ చేశారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రేజా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల కానుంది. కాగా మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘నటసమ్రాట్’కు రంగమార్తాండ తెలుగు రీమేక్.