
నాగశౌర్య, షెర్లీ సేతియా జంటగా అనీష్ కృష్ణ రూపొందించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనీష్ కృష్ణ చెప్పిన విశేషాలు. ‘‘ఇది చాలా బలమైన కథ. నేనేమో స్టోరీ నేరేషన్లో వీక్. అలాంటిది శౌర్యకు కథ చెప్పి ఒప్పించానంటే అదంతా స్టోరీ గొప్పదనమే. నా ఫ్రెండ్ జీవితంలో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా రాశాను. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కృష్ణ, వ్రిందలది హిలేరియస్ జర్నీ. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. శౌర్య బ్రాహ్మణ పాత్ర పోషించాడు. కమల్ హాసన్ దగ్గర్నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని లాంటి వారంతా ఇలాంటి క్యారెక్టర్లో కనిపించి ఆకట్టుకున్నారు. శౌర్య కూడా యునిక్గా కనిపిస్తాడు. ఆయనలో ఒకరకమైన అమాయకత్వం, క్యూట్నెస్, కొంటెతనం, అల్లరి ఉంటాయి. అందుకే ఈ పాత్రకి తనే యాప్ట్. ఆచార్యులు బ్యాక్డ్రాప్ డిఫరెంట్గా ఉంటుంది.
శౌర్యలో ఆ చార్మ్ కనిపించింది. అందుకే కథ పూర్తయ్యాక నేరుగా శౌర్యనే కలిశాను. ఆయనకి బాగా నచ్చడంతో వాళ్ల బ్యానర్లోనే నిర్మించారు. ప్రమోషన్స్లో భాగంగా కొన్ని పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశాం తప్ప ఇందులో ఉన్న యునిక్ పాయింట్ని రివీల్ చేయలేదు. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కథపై ఒక అవగాహన ఇస్తాం. షెర్లీ పాత్ర చాలా కీలకం. బయటికి సరదాగా ఉన్నా ఇంటర్నల్గా తనకి ఒక ఇష్యూ ఉంటుంది. ఈ కథలో అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. శౌర్య తల్లిగా రాధిక నటించారు. బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిశోర్ల పాత్రలు ఎంటర్టైనింగ్గా ఉంటాయి. కంటెంట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇండస్ట్రీకొచ్చి ఎనిమిదేళ్లవుతున్నా సరైన అవగాహన లేక తక్కువ సినిమాలు చేశా. ఇకపై స్పీడ్ పెంచుతాను. ఆల్రెడీ కొన్ని కథలు రెడీ చేశాను. ప్రతి కథలోనూ హ్యూమర్ ఉంటుంది. వీటితో పాటు గాడ్ఫాదర్, దళపతి చిత్రాల స్టైల్లో మాంచి ఎమోషనల్ యాక్షన్ మూవీ చేయాలనుంది.’’