హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్

హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్

ఐపీఎల్ -14 సీజన్ సమయం దగ్గరపడుతున్నా వేదికపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎక్కడ నిర్వహించాలనేదానిపై కొన్ని రోజులుగా బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, చెన్నై, బెంగళూరు ఇలా కొన్ని వేదికలు అనుకున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో బీసీసీఐ వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బీసీసీఐ పరిశీలనలో హైదరాబాద్ కూడా ఉన్నట్లు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు ఓ ఆఫర్ ఇచ్చారు. ఐపీఎల్ 14 సీజన్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని కోరారు.  మ్యాచ్ ల నిర్వహణకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు.  దేశంలోని మెట్రో అన్ని మెట్రో సిటీల కంటే హైదరాబాద్ లో తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నట్లు  చెప్పారు.