- ఫ్రీ కరెంట్ ఎత్తేస్తామనడం .. క్రూరమైన ఆలోచన
- రైతుల్ని చంపుకు తినే రాబందు కాంగ్రెస్ : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : ‘‘రైతుల్ని చంపుకుతినే రాబందు కాంగ్రెస్ పార్టీ అని మరోసారి తేలిపోయింది” అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఉచిత విద్యుత్కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా కుట్రలు జరగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ కామెంట్స్కు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలకు టెలీకాన్ఫరెన్స్లో ఆయన పిలుపునిచ్చారు. ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. 24 గంటల కరెంట్ రద్దు చేసి.. 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం దుష్ట విధానాలకు పరాకాష్ట. తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిది. రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణం” అని కేటీఆర్ దుయ్యబట్టారు.
వేల కోట్లు ఖర్చు చేసి ఉచిత కరెంట్ ఇస్తున్నం
తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి విద్యుత్రంగంపై వేల కోట్లు ఖర్చు చేసి తమ ప్రభుత్వం ఉచిత కరెంట్ఇస్తున్నదని, దీంతో రైతులు కష్టపడి పంటలు సాగు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘‘ఉచిత కరెంట్ను ఆపివేయించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నిబంధన పెట్టింది. రైతుల కోసం మేము మోటార్లు పెట్టేందుకు నిరాకరిస్తే రాష్ట్రానికి రావాల్సిన రూ. 30 వేల కోట్లు రాకుండా అడ్డుకున్నది. రాష్ట్ర రైతులను చూసి కాంగ్రెస్కు కళ్లు మండుతున్నయ్” అని విమర్శించారు.