పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం

పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం

 ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలి పని చేసుకుంటున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై స్పందించిన కేటీఆర్ ఆయనను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.  ఈ క్రమంలో మే 5వ తేదీ ఆదివారం కేటీఆర్.. మొగులయ్యను కలిసి కొంత ఆర్థిక సాయం చేశారు. 

మొగులయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.  కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారి జీవితం గడపడడమే కష్టంగా ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సహాయం పట్ల మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు.