కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత, వస్త్ర పరిశ్రమపైన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన GST పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. కరోనా వల్ల ఇప్పటికే టెక్స్ టైల్ రంగం రెండేళ్లుగా గడ్డు పరిస్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడం సరికాదన్నారు. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్, చేనేత రంగానికి ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం