కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే ..ఇంకా ఆధారాలు కావాలా?: కేటీఆర్

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే ..ఇంకా ఆధారాలు కావాలా?: కేటీఆర్

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసింది కాంగ్రెస్ గూండానే అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.  నిందితుడు గటని  రాజు  కాంగ్రెస్ కండువా కప్పుకుని..    ప్రచారం చేస్తున్నటువంటి ఫోటోలను   తన ఫేస్ బుక్ ఫ్రొపైల్ లో పోస్టు   చేశాడు. ఈ ఫోటోలను  మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి...  ఇంకా ఆధారాలు కావాలా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్.

అక్టోబర్ 30న  మెదక్ ఎంపీ, ప్రస్తుతం దుబ్బాక్ సెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది.  మధ్యాహ్నం.. ఆయన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ యూ ట్యూ్బ్ ఛానల్ లో పనిచేస్తున్న గటని రాజు అనే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డిపై   కత్తితో దాడి చేశాడు. ప్రచారంలో చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ తోపుకుంటూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై.. కత్తితో హత్యయత్నం చేశాడు. విషయాన్ని వెంటనే గమనించిన సెక్యూరిటీ గార్డులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని అడ్డుకుకున్నారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమికి చికిత్స్ అనంతరం సికింద్రాబాద్ లో ని యశోద ఆసత్పికి తరలించారు.