జల్సాలకు అలవాటుపడి దొంగగా మారిన యువకుడు అరెస్ట్

జల్సాలకు అలవాటుపడి దొంగగా మారిన యువకుడు అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి.. ఈజీగా మనీని కాజేస్తున్న దొంగను పోలీలు అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద నుంచి రూ. 12 లక్షలు విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో అన్ని మహిళలకు సంబంధించిన బంగారు కమ్మలు, గొలుసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు పెదవళ్లి గ్రామానికి చెందిన సంజయ్ కుమార్  గా గుర్తించారు.

గతంలో ఇతని పేరుపై కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు కూకట్ పల్లి ఏసీపీ శివ భాస్కర్ వెల్లడించారు.