కూకట్పల్లి, వెలుగు: హత్య జరిగిన మూడు గంటల్లోనే కూకట్పల్లి పోలీసులు హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు. యూపీకి చెందిన జంషెద్అహ్మద్(54), బీహార్కు చెందిన ముకేష్కుమార్ఝూ(34) ప్రశాంత్నగర్లోని ట్రాన్స్ఫార్మర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ రాజీవ్గాంధీనగర్లో ఒకే గదిలో ఉంటున్నారు.
డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న లావాదేవీలున్నాయి. మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి తమ గదిలోనే మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన జంషెద్అహ్మద్ కిచెన్లోని కత్తి తీసుకుని ముకుశ్కుమార్ ఛాతీపై పొడిచి హత్య చేసి పరారయ్యాడు. రాత్రి పదిన్నరకు మర్డర్జరగ్గా స్థానికుల సమాచారం, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని మూడు గంటల్లోనే పట్టుకోగలిగారు. బుధవారం నిందితుడిని రిమాండ్కు తరలించారు.
