కేపీహెచ్బీలో కారు బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం

కేపీహెచ్బీలో కారు బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం

కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడని బాధితులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రలును స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకుున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.