హైదరాబాద్ కూకట్ పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కూకట్ పల్లి వివేకానంద నగర్ దగ్గర కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు బైకు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Also Read :- కార్గిల్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రత నమోదు
NL 07 B 0767 నెంబర్ గల ట్రావెల్స్ బస్సు అతివేగంతో వస్తోంది. అర్థరాత్రి సమయంలో కూకట్ పల్లికి రాగానే బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ ముందున్న బైకు, కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బస్సును అక్కడ నుంచి తరలించారు.