కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలి: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలి:  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 కురుమలకు మరిన్ని రాజకీయ అవకాశాలు రావాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం గాంధీ భవన్ లో కురుమ ఆత్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పలురువు కాంగ్రెస్ నాయకులతోపాటు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి.. కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాయన్నారు.

బీసీలో కురుమ సంఖ్య పెద్దదే అని చెప్పారు. వారికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తామన్నారు. గద్వాలలో సరితకు అవకాశం ఇచ్చింది పార్టీ.. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల ఆమె ఓటమిపాలయ్యిందని చెప్పారు. సరితా గెలిస్తే కురుమలకు మరింత బలం ఉండేదన్నారు. బీర్ల ఐలయ్య  ఎమ్మెల్యేగా గెలిచి కురుమలకు ప్రతినిధిగా నిలిచారన్నారు. 
 
కార్పొరేషన్ పదవులు కూడా కురుమలకు రావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. కురుమ కులానికే చెందిన కొల్లూరు మల్లప్ప.. మొట్టమొదటి హైదరాబాద్ స్టేట్ కు పీసీసీ చీఫ్ గా పనిచేశారని గుర్తు చేశారు. ఐలయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసి కురుమలకు.. పార్టీలో, ప్రభుత్వంలో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.