ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పులపాలైన తెలంగాణ

ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పులపాలైన తెలంగాణ

టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ నేతలే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ ను గద్దె దించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్ ఆపే వరకూ బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. గోల్కొండ కోట మీద కషాయం జెండా ఆవిష్కరించడం ఖాయమన్నారు. రైతులతో పాటు బడుగు, బలహీన వర్గాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 300 సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

బిహార్ లో భారీ గోల్డ్ మైన్

నేడు ఐపీఎల్‌ ఫైనల్‌