
సాయి కుమార్ కీలకపాత్రలో.. వినయ్, అరుణ్, దీప్తి వర్మ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ఫర్ ఓట్ అనేది ట్యాగ్లైన్. ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం జరిగింది. సాయికుమార్ మాట్లాడుతూ ‘ఓటు మన బాధ్యత. ఓటు వేయడం మన కర్తవ్యం. అలాంటి ఓటు విలువ తెలియజేసేలా దీన్ని తెరకెక్కించారు. ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. టీమ్ అంతా మాట్లాడారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. పాతికేళ్ల పొలిటికల్ కెరీర్ను నిలబెట్టుకోవడం కోసం ఎన్నికలను ప్రెస్టేజ్గా తీసుకుని, ఓటర్లకు వంద కోట్లు పంచేందుకు రెడీ అవుతాడు. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ రూపాయి కూడా పంచకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతి తక్కువ టైమ్లో ఓటుకు ఐదు వేలు చొప్పున, రెండు లక్షల మందికి ఎలా డబ్బు పంచారు అనేది కాన్సెప్ట్. యు శ్రీనివాసుల రెడ్డి, బి నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే పురుషోత్తం రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.