జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట డిప్యూటీ మేయర్ఎస్.ధన్రాజ్యాదవ్, ఎనిమిదో డివిజన్కార్పొరేటర్సురేశ్రెడ్డిపై భూఆక్రమణ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన తులసీ నర్సింహ(55)కు, అతని కుటుంబ సభ్యులకు సర్వే నంబర్ 191లో 360 గజాల స్థలం ఉంది. దాని చుట్టూ కాంపౌండ్వాల్నిర్మించుకుని చిన్నరూములు నిర్మించుకున్నారు.
అయితే ధన్రాజ్, సురేశ్రెడ్డి ఆ గదులను, కాంపౌండ్వాల్ను కూల్చివేసి ఆక్రమించారు. కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. నర్సింహ, కుటుంబ సభ్యులు వారిని ప్రశ్నించగా కులం పేరుతో దూషించడమే కాక, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. దీంతో బాధితుడు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ట్రెస్పాస్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.