నిజాంపేట డిప్యూటీ మేయర్, కార్పొరేటర్​పై..భూకబ్జా కేసులు నమోదు

నిజాంపేట డిప్యూటీ మేయర్, కార్పొరేటర్​పై..భూకబ్జా కేసులు నమోదు

జీడిమెట్ల, వెలుగు:  నిజాంపేట డిప్యూటీ మేయర్​ఎస్.ధన్​రాజ్​యాదవ్, ఎనిమిదో డివిజన్​కార్పొరేటర్​సురేశ్​రెడ్డిపై భూఆక్రమణ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన తులసీ నర్సింహ(55)కు, అతని కుటుంబ సభ్యులకు సర్వే నంబర్ 191లో 360 గజాల స్థలం ఉంది. దాని చుట్టూ కాంపౌండ్​వాల్​నిర్మించుకుని చిన్నరూములు నిర్మించుకున్నారు. 

అయితే ధన్​రాజ్, సురేశ్​రెడ్డి ఆ గదులను, కాంపౌండ్​వాల్​ను కూల్చివేసి ఆక్రమించారు. కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. నర్సింహ, కుటుంబ సభ్యులు వారిని ప్రశ్నించగా కులం పేరుతో దూషించడమే కాక, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. దీంతో బాధితుడు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ట్రెస్​పాస్​ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.