పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు ఎమ్మెల్యే లాస్య మృతదేహం

పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు ఎమ్మెల్యే లాస్య మృతదేహం

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ లోని గాంధీ హాస్సిటల్ కు తరలించారు. ఈ రోజు ఉదయం ఆమె నివాసం నుంచి సదాశివపూరం కారులో వెళ్తు్ండగా.. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం గురైంది. ఈ యాక్సిడెంట్ లో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలైయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని డ్రైవర్ ను మియాపూర్ లోని శ్రీకర్ హాస్పిటల్ కు తరలించారు. 

లాస్య నందిత మృతదేహాన్ని అమేద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పోస్టుమార్టం కోసం ఇప్పుడే గాంధీ హాస్పిటల్ కు చేర్చారు. ఎమ్మెల్యే హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తోపాటు పలువురు లాస్య మృతి పట్ల సంతాపం తెలిపారు.