మొదటి చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా వినిపించారు. డిసెంబర్ 7న రికార్డ్ చేసిన ఈ సందేశంలో భారత సైనికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 1971లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో విజయం సాధించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ యుద్ధంలో అమరులైన వారికి అంజలి ఘటిస్తున్నా... బిజీ షెడ్యూల్ ఉండటంతో.. ఈ నెల 7నే రావత్ సందేశాన్ని రికార్డ్ చేశారు.