నీట్ కోచింగ్ తీసుకొవడానికి వచ్చిన ఓ స్టూడెంట్ తోటి విద్యార్థులకు దగ్గర ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడు. బెట్టింగ్లో ఓడిపోయిన డబ్బులు ఇవ్వకపోవడంతో అతన్ని కొన్ని రోజులపాటు రూంలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాకు చెందిన విద్యార్థి కాన్పూర్లో నీట్ కోటింగ్కు వచ్చాడు. కొంతమంది సీనిరయర్లతో పరిచయం ఏర్పడి క్రికెట్ మ్యాచ్లో బెట్టింగ్ పెట్టాడు. ఆ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లో సీనియర్లకు దాదాపు రూ.2లక్షలు బాకీ ఉన్నాడు.
#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.
— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024
Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y
బెట్టింగ్ డబ్బులు ఇవ్వమని అడిగితే రూ.20వేలు ఇచ్చి మిగతా అమౌంట్ తన దగ్గర లేదని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా బెట్టింగ్ పైసలు ఇవ్వడం లేదని సీనియర్లు అతన్ని వాళ్ల రూంకి తీసుకెళ్లి టార్చర్ చేశారు. కొన్ని రోజులపాటు గదిలో బంధించి దాడి చేశారు. కొట్టి, ప్రైవేట్ పార్ట్స్ పై తన్నారు. జుట్టు కాల్చారు. ఇలా నానా రకాలుగా హింసిస్తూ వీడియోలు తీశారు. ఆ వీడియోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. తర్వాత విద్యార్థి ఆ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పగా వారు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాన్పూర్ పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిపై సెక్షన్లపై కేసు ఫైల్ చేశారు.