ఇబ్రహీంపట్నం: గ్రామకంఠం భూమి ఆక్రమణపై ధర్నా

ఇబ్రహీంపట్నం: గ్రామకంఠం భూమి ఆక్రమణపై ధర్నా

ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రామకంఠం భూమిని ఆక్రమించిన వారిపై  చర్యలు తీసుకోవాలని డీఎస్పీ చీఫ్​విశారదన్ మహరాజ్ డిమాండ్​చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో  గ్రామస్తులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండుమైలారంలోని నాలుగున్నర ఎకరాల భూమి గ్రామ పంచాయతీదేనన్నారు. 

మాజీ సర్పంచ్​ఆధీనంలో ఉన్న ఈ భూమి జీపీకే చెందాలని, అప్పటివరకు పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్​నరేశ్, స్థానిక పలువురు నాయకులు పాల్గొన్నారు.