హైదరాబాద్ సిటీ , వెలుగు: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 1,627 దరఖాస్తులు రాగా, ఇందులో అత్యధికంగా 2 బీహెచ్కేల కోసం వచ్చినవే ఉన్నాయి. సోమవారం అడిషనల్కలెక్టర్లు కదిరవన్ పళని, జితేందర్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించగా.. డబుల్బెడ్రూమ్ఇండ్ల కోసం 1,462 అర్జీలు వచ్చాయి. తర్వాత పింఛన్లకు 120 మంది, రెవెన్యూ సమస్యలపై 16 మంది, ఇతర శాఖలకు సంబంధించి 29 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు.
