ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ సర్వీసెస్ మే8న 70 విమానాలను తాత్కాలికంగా నిపివేశారు. వాటిల్లో కొన్ని నేషనల్, ఇంటర్నేషనల్ సర్వీసులు ఉన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎంప్లాయిస్ అందరూ ఒకేసారి సిక్ లీవ్ తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియాలో సీనియర్ ఎంప్లాయిస్ సమ్మె చేస్తున్నారని సమాచారం. క్యాబిన్ సిబ్బందిలో కొంత మంది ఉద్యోగులు చివరి నిమిషంలో సిక్ లీవ్ తీసుకున్నారని, దీంతో మంగళవారం రాత్రి నుంచి విమానాల రాకపోకలకు నడపడానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్తున్నారు.
ప్రాబ్లమ్ సాల్వూ చేయడానికి ఎయిర్ లైన్స్ స్టాఫ్ ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల అసౌకర్యానికి పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొంత మందికి టికెట్స్ రిఫండ్ చేస్తామని, లేదా జర్నీ రీ షెడ్యూల్ చేస్తామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.