ఇయ్యాల ఘట్​కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ షురూ

ఇయ్యాల ఘట్​కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ షురూ

ఘట్ కేసర్, వెలుగు:  ప్రయాణికులకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేందుకు ఘట్ కేసర్ నుంచి లింగంపల్లి వరకు మంగళవారం ఎంఎంటీఎస్ రైలు సర్వీసును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే డీఆర్ఎం భరతేశ్​కుమార్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్-–2 ప్రాజెక్టులో భాగంగా ఘట్ కేసర్ నుంచి మౌలాలి, -సనత్ నగర్  మీదుగా లింగంపల్లి వరకు నడిచే రైలును ప్రధాని ఫ్లాగ్ అప్ చేయనున్నారని చెప్పారు. ఉదయం గం. 10.30 లకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.  ఎంఎంటీఎస్ రైలు సర్వీసు సేవలు ప్రారంభమవుతుండగా..స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రావడంతో మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని, సమయానికి ఆఫీసులు, ఇండ్లకు చేరుకోగలుగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.