- రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకీ చోటు
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజీన్ ఏటా ప్రకటించే ‘ప్రపంచ ప్రభావ శీలుర’ జాబితా ఈసారి మరింత ప్రత్యేకంగా నిలిచింది. బుధవారం టైమ్స్ ప్రకటించి న 100 మంది పేర్లలో భారతీయ మహిళా లాయర్లు అరుంధతి ఖట్జూ, మేనకా గురుస్వామిలకు చోటు దక్కింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఇండియన్ అమెరికన్ టీవీ హోస్ట్ హసన్ మినాజ్ కూడా జాబితాలో చోటు పొందాడు. సుప్రీంకోర్టులో లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న అరుంధతి, మేనక.. దశాబ్దం పైబడి ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377 కొట్టివేతలో వీళ్లిద్దరూ కీలక పాత్ర పోషించారు. టైమ్స్ పయనీర్స్(మార్గదర్శకుల) విభాగంలో చోటుదక్కించుకున్న ఈ ఇద్దరి గురించి మ్యాగజైన్లోనటి ప్రియాం క చోప్రా రాయగా, ముఖేశ్ అంబానీ ప్రత్యేకతను మరో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్మహీంద్రా వివరించారు. నెట్ ఫ్లిక్స్లో ప్రసారమైన‘పేట్రియాట్ యాక్ట్’ సిరీస్తో పాపులరైన టీవీ హోస్ట్ హసన్ మినాజ్పై కెనడియన్ పొలిటికల్ కామెంటేటర్ ట్రెవర్ నోవా వ్యాసం రాశారు. పయనీర్స్,ఆర్టిస్టులు, లీడర్స్, ఐకాన్స్, టైటాన్స్ అనే ఐదు విభాగాల్లో మొత్తం 100 మంది పేర్లను ప్రకటిం చారు. ఈ ఏటి జాబితాలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ఓపెన్ విన్నర్ నవోమీ ఒసాకా, నటుడు మహర్షలా అలీ, రమీ మలేక్ , మాజీ ఫస్ట్లేడీ మిచెల్లీ ఒబామా, సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా,సింగర్ లేడీగాగా, దుబాయ్ యువరాజు మొహ్మద్ బిన్ జెయేద్ , ట్రంప్–రష్యా సంబంధాలపై దర్యాప్తు చేసిన కౌన్సిలర్ రాబర్ట్ ముల్లర్ కు చోటుదక్కింది.