ఇండియాలో కూడా వివక్షకు గురయ్యా

ఇండియాలో కూడా వివక్షకు గురయ్యా

కాన్పూర్‌‌‌‌‌‌‌‌: క్రికెట్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ను కుదిపేస్తున్న రేసిజమ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇండియా మాజీ లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ శివరామకృష్ణన్‌‌‌‌‌‌‌‌ సంచలన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తాను రేసిజమ్‌‌‌‌‌‌‌‌ బాధితుడినే అని చెప్పిన శివరామకృష్ణన్‌‌‌‌‌‌‌‌.. ఇండియాలో కూడా వివక్షకు గురయ్యాయని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో  పెద్ద వివాదంగా మారిన రేసిజమ్‌‌‌‌‌‌‌‌ స్కాండల్‌‌‌‌‌‌‌‌పై సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు కామెంటేటర్లు ట్రోలింగ్‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన శివరామకృష్ణన్‌‌‌‌‌‌‌‌ తాను ఎదుర్కొన్న రేసిజమ్‌‌‌‌‌‌‌‌ను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వెల్లడించాడు. ‘ బాడీ కలర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇప్పటిదాకా నా జీవితమంతా ఎన్నో విమర్శలు, వివక్ష ఎదుర్కొన్నా. అందువల్ల వాటిని నేను పెద్దగా పట్టించుకోను. అయితే అలాంటి అవమానం నాకు నా సొంత దేశంలోనూ జరగడమే దురదృష్టం’ అని శివరామకృష్ణన్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.