హైదరాబాద్ ఎల్ బీనగర్ లో ఆగస్టు 3న ఓ ప్రేమోన్మాది పెళ్లికి నిరాకరిస్తోందనే కారణంతో ప్రియురాలు, ఆమె తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ దాడిలో తమ్ముడు పృథ్వి అక్కడికక్కడే మృతి చెందగా, సంఘవి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
నగరంలోని ఎల్ బీనగర్ ప్రాంతంలో సంఘవి, ఆమె సోదరుడు పృథ్వీ నివసిస్తున్నారు. ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి వారిపై దాడికి పాల్పడ్డాడు. అతను సంఘవి ప్రియుడని, పెళ్లి కి ఒప్పుకోకపోవడంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్ కి తరలించారు. కొంతకాలంగా శివకుమార్, సంఘవి ప్రేమించుకుంటున్నారని, పెళ్లి గురించి మాట్లాడేందుకు వచ్చాడు.
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన శివకుమార్ వెంట తీసుకువచ్చిన కత్తితో దాడికి పాల్పడ్డాడు. పృథ్వి వారిని ఆపడానికి ప్రయత్నించగా ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు.